పోలీస్ శాఖ నుంచి సీఐ నాగేశ్వరరావు తొలగింపు

పోలీస్ శాఖ నుంచి సీఐ నాగేశ్వరరావు తొలగింపు

సీఐ నాగేశ్వరరావు రావును సర్వీస్ నుంచి తొలగిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వనస్థలిపురంలో మహిళను తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసిన కేసులో ఆయన జైలుకెళ్లి ఇటీవలె బెయిల్పై విడుదలయ్యారు. తీవ్రమైన నేరారోపణలు ఉన్నందున ఆర్టికల్ 311(2) బి కింద సర్వీస్ రిమూవల్ చేశారు. సర్వీస్ రిమూవల్ కోరుతూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ రిక్రూట్మెంట్ అథారిటీకి లేఖ రాయగా..సీపీ లేఖను పరిగణలోకి తీసుకున్న పోలీస్ రిక్రూట్మెంట్ అథారిటీ నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించింది. పోలీస్ శాఖ హైదరాబాద్ లో 39 మందిని సర్వీస్ నుంచి తొలగించింది.
 
నేరుగా ఇంటికెళ్లి అత్యాచారం 

జులై 6న తన ఫాంహౌస్ లో పనిచేస్తున్న మహిళకు నాగేశ్వర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్‌‌‌‌‌ చేసి తన కోరిక తీర్చాలని బెదిరించాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నేరుగా హస్తినాపురంలోని ఆమె ఇంటికి వెళ్లి.. ఆమెపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్త.. భార్య ఏడుపులు విని తలుపులు పగులగొట్టాడు.  దాంతో సీఐ రివాల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను బయటకు తీసి..చెప్పినట్లు వినకుంటే బ్రోతల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు పెడతానని దంపతులిద్దరిని బెదిరించి ఓ వెహికిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కించుకుని వనస్థలిపురం నుంచి ఇబ్రహీంపట్నానికి బయలుదేరాడు. ఇబ్రహింపట్నం సమీపంలోని చెరువు బ్రిడ్జి వద్ద కారు ప్రమాదానికి గురైంది. భార్యాభర్తలు అక్కడి నుంచి తప్పించుకుని వనస్థలిపురం వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు.