చెరువుల వద్ద పోలీస్ శాఖ హెచ్చరిక బోర్డులు

చెరువుల వద్ద పోలీస్ శాఖ హెచ్చరిక బోర్డులు

ఝరాసంగం,వెలుగు: పిల్లలకు వేసవి సెలువులు రావడంతో  స్థానికంగా ఉండే చెరువుల్లో ఈతకు వెళ్లి ప్రాణాలకు ముప్పు తెచ్చుకునే ప్రమాదం ఉంటుందని స్థానిక ఎస్​ఐ రాజేందర్​రెడ్డి అన్నారు. బుధవారం తన సిబ్బందితో కలిసి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో గల చెరువులు, కుంటల వద్ద ఈతకు వెళ్లొద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌‌ఐ మాట్లాడుతూ.. పిల్లలు సమ్మర్‌‌‌‌లో ఎటు వెళుతున్నారనేది గమనించాలని సూచించారు.