భర్తను కిడ్నాప్ చేసి చంపి.. పెట్రోల్ పోసి తగలబెట్టింది

భర్తను కిడ్నాప్ చేసి చంపి.. పెట్రోల్ పోసి తగలబెట్టింది
  • అక్రమ సంబంధానికి అడ్డొస్తుండని భార్య దుర్మార్గం
  • గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును చేధించిన కడ్తాల్ పోలీసులు
  • మృతుడి భార్యతో పాటు ప్రియుడు, మరొకరు అరెస్ట్  
  • మీడియాకు శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడి 

శంషాబాద్, వెలుగు : కడ్తాల్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ కేసును పోలీసులు చేధించారు. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే భర్తను భార్య ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు తేలింది.  ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణరెడ్డి సోమవారం మీడియాకు తెలిపారు. గత నెల30న కడ్తాల్ పీఎస్ పరిధి మక్త మాధారంలోని బటర్ ఫ్లై సిటీ వెంచర్ లో కాలిపోయిన గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. మృతుడు బాలాపూర్ పరిధి నాదర్ గుల్ గ్రామం బాలాజీ నగర్ కు చెందిన తాండ్ర రవీందర్ (45) గా గుర్తించారు. కాగా అతని భార్య సంగీత బాలాపూర్ కు చెందిన యాదిగిరి అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో ఎలాగైనా రవీందర్ ను   అడ్డు తొలగించుకోవాలని  భార్య సంగీత ఆమె ప్రియుడు యాదగిరి, అతని ఫ్రెండ్ అనిల్ కుమార్ ప్లాన్ చేశారు. గత నెల 29న రాత్రి రవీంద్ర తన భార్య కోసం స్థానిక విశాల్ మార్ట్ వద్ద వేచి ఉండగా.. ఆ విషయం యాదగిరికి సంగీత చెప్పింది.

 అనంతరం నిందితులు ముగ్గురూ కలిసి రవీంద్రను కారులో( టీఎస్ 07 జేడీ1008)లో  కిడ్నాప్  చేసి తీసుకెళ్లి.. దారుణంగా హింసించి కొట్టి చంపారు.  ఆనవాళ్లు దొరకకుండా డెడ్ బాడీపై పెట్రోల్ పోసి కాల్చి వెంచర్ లో పడేసి పోయారు.  మరుసటి రోజు సంగీత తన భర్త కనిపించడం లేదని బావ రఘునందన్ కు ఫోన్ చేసి తెలిపింది. దీంతో అతను పోలీసులకు కంప్లయింట్ చేయమని ఆమెకు సూచించాడు. నిర్లక్ష్యంగా ఉంటుండగా సంగీతను తీసుకుని రఘునందన్ మీర్ పేట పోలీసులకు కంప్లయింట్ చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా మిస్సింగ్ కేసును చేధించిన కడ్తల్ పోలీసులను డీసీపీ నారాయణరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.