ఈటల కాన్వాయ్‌లోని మూడు కార్లు సీజ్

ఈటల కాన్వాయ్‌లోని మూడు కార్లు సీజ్

హుజురాబాద్ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్ నమోదయ్యింది. అక్కడక్కడ ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్,బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారని పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.  బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కాన్వాయ్‎కు చెందిన మూడు వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. కమలాపూర్ మండలం మరిపెల్లి గూడెంలో వాహనాలకు అనుమతిలేదని ఈటలకు చెందిన మూడు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా ఈటల రాజేందర్ పీఆర్వోను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.