నిరసనకారుల్ని చర్చలకు ఆహ్వానించిన పోలీసులు

నిరసనకారుల్ని చర్చలకు ఆహ్వానించిన పోలీసులు

సికింద్రాబాద్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనను స్పష్టమైన హామీ వచ్చే వరకు విరమించే ప్రసక్తేలేదని నిరసనకారులు అంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని చర్చలకు ఆహ్వానించారు. 10 మంది ఆందోళనకారుల్ని చర్చలకు పిలిచారు. వారిని ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసర్ వద్దకు తీసుకెళ్తామని అంటున్నారు. అయితే ఆందోళనకారులు మాత్రం ఆర్మీ రిక్రూట్మెంట్అధికారి వద్దకు అందరం వస్తామని పట్టుబడుతున్నారు. లేనిపక్షంలో అధికారినే తమ వద్దకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు నిరాకరించిన పోలీసులు అరగంటలో చర్చలకు రావాలని స్పష్టం చేశారు. 

మరోవైపు ఆందోళనకారుల్ని పోలీసులు నలువైపులా చుట్టుముట్టారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సికింద్రాబాద్ స్టేషన్ వద్ద భారీగా సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ బలగాలు మోహరించారు.