ఇందిరా పార్క్ వద్ద బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి

ఇందిరా పార్క్ వద్ద బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు దీక్షకు అనుమతి

హైదరాబాద్: ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ  ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు ఎట్టకేలకు పోలీసులు అనుమతిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమై... సాయంత్రం 4గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ముందుగా దీక్షకు అనుమతి ఇవ్వని పోలీసులు...బీజేపీ నేతలు కోర్టుకు వెళ్లటంతో... చివరికి అనుమతి ఇచ్చారు. దీంతో దీక్షలో పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు... కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు పాల్గొననున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను సభకు అనుమతించే విషయంపై హైకోర్టు తీర్పును స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ దీక్ష చేస్తున్నారు పార్టీ నేతలు. 

 

 

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నయ్