అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేతపై చంద్రబాబుపై కేసు నమోదయ్యింది. తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్ లో 307 సెక్షన్ కింద చంద్రాబాబుపై కేసు పెట్టారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగల్లులో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగం క్రమంలో కేసు నమోదు చేశారు.
చంద్రబాబుతో పాటు మరో 20 మందిపై కేసు నమోదు చేశారు. ఈ అల్లర్లలో చంద్రబాబును ఏ1గా చేర్చారు. మాజీ మంత్రి దేవినేని ఉమను ఏ2గా, అమర్నాథ్ రెడ్డిని ఏ3గా చేర్చారు. కురబలకోట మండలం, దాదంవారిపల్లి చెందిన ఉమాపతిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదుచేశారు. హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో తెలిపారు పోలీసులు. క్రైమ్ నెంబర్ 79 /2023 120బి 147 145 153 307 115 109 323 324 506 R/w149 ipc సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని చెప్పారు ముదివేడు ఎస్సై షేక్ మొబిన్ తాజ్ .
ఎఫ్ఐఆర్ లో ఉన్నది వీళ్లే..
- A1 నారా చంద్రబాబు
- A2 మాజీ మంత్రి దేవినేని ఉమ
- A3. అమర్నాథ్ రెడ్డి
- A4 ,రాంభూపాల్ రెడ్డి
- A5,షాజహాన్ భాష
- A6,దొమ్మలపాటి రమేష్
- A7,కిషోర్ కుమార్ రెడ్డి
- A8,ఘంటా నరహరి
- A9,శ్రీరామ్ చినబాబు
- A10,శ్రీధర్ వర్మ
- A11,ఆర్ శ్రీనివాసరెడ్డి
- A12,పులివర్తి నాని
- A13, ఎం రాంప్రసాద్ రెడ్డి
- A14,పలన్ ఖాదర్ ఖాన్
- A15, వై జి రమణ
- A16, వై జి సురేంద్ర
- A17,రాచకొండ మధుబాబు
- A18,పర్వీన్ తాజ్
- A19, ఏలగిరి దొరస్వామి నాయుడు
- A20, నారాయణస్వామి రెడ్డితో పాటు మరి కొందరు