స్టేడియంలోకి బ్యాగ్స్, వాటర్ బాటిల్స్కు నో పర్మిషన్

స్టేడియంలోకి బ్యాగ్స్, వాటర్ బాటిల్స్కు నో పర్మిషన్

ఉప్పల్ లో జరగనున్న భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 2,500 మంది పోలీసులను మోహరించారు. 300 సీసీ కెమెరాలతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భద్రత కారణాల దృష్ట్యా స్టేడియంలోకి మొబైల్స్ తప్ప ఇతర వస్తువులను అనుమతించేది లేదని నిమిత్తం రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. ల్యాప్ప్టాప్, వాటర్ బాటిల్, బ్యానర్లు, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టె, లైటర్, కాయిన్స్, పెన్నులు, హెల్మెట్, బ్యాగ్స్, బయటి ఫుడ్, బ్యాటరీలు, బైనాకులర్స్ పై నిషేధం విధించారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది.

పార్కింగ్ ఫెసిలిటీ: 

కాలినడకన వచ్చేవాళ్లు స్టేడియంలోని ఏ గేటు నుంచైనా లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తారు. టూ వీలర్స్ ను ‘బీ’ ఏరియాలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. దివ్యాంగులు రామంతపూర్ రోడ్డు మీదుగా మూడో నెంబర్ గేటు నుంచి లోపలికి రావచ్వచు. కార్ పాస్ ఉన్నవాళ్లు రామంతపూర్ వైపు నుంచి స్టేడియం లోపల ఉన్న ఏ, బీ ఏరియాల్లో పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.