220 కిలోల గంజాయి పట్టి వేత

220 కిలోల గంజాయి పట్టి వేత

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న రూ.55 లక్షల విలువైన  220 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం ఎక్సైజ్​డిప్యూటీ కమిషనర్​ హరికిషన్​వివరాలు వెల్లడించారు. పటాన్​చెరు పీఎస్​పరిధిలోని ముత్తంగి రింగ్​రోడ్డ వద్ద గురువారం రాత్రి రూట్

​వాచ్​చేస్తుండగా  మహారాష్ట్రకు చెందిన చంద్రకాంత్, విశాల్ దిలీప్​, అమర్​సంజయ్​మహీంద్రా కారులో అనుమానాస్పదంగా కనిపించారు. దగ్గరికి వెళ్లే సరికి ఇద్దరు పారిపోగా  చంద్రకాంత్ ను పట్టుకున్నామని చెప్పారు. అతడి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకొని కారును సీజ్​ చేసినట్లు తెలిపారు.