
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ టౌన్లో జరిగిన చోరీ కేసును పోలీసులు గంటల్లోనే ఛేదించారు. సీఐ కరుణాకర్ రావు ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ టౌన్ చిల్కూరి లక్ష్మీనగర్ కాలనీకి చెందిన షేక్ సమీర్ ఓ కేసులో ఏడాది జైలు శిక్ష అనుభవించి నాలుగు రోజుల కింద రిలీజ్ అయ్యాడు. గంజాయికి బానిసైన షేక్ సమీర్.. క్రాంతి నగర్కు చెందిన షేక్ అయాన్, మహారాష్ట్ర కు చెందిన రాహుల్తో కలిగిసి శనివారం రాత్రి స్థానిక చౌడేశ్వరి మాత ఆలయంలోకి వెళ్లి, వాచ్ మెన్ను కత్తితో బెదిరించి రూ. 3 వేల నగదు, మూడు గ్రాముల బంగారం ముక్కు పుడక చోరీ చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం రైల్వే స్టేషన్ ఏరియాలో షేక్ సమీర్ ను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి కత్తి, గంజాయి తాగే పరికరం, రూ. వెయ్యి నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లోనే టూటౌన్ పోలీసులు కేసును ఛేదించారు.