ఇవాళ మరోసారి కేసీఆర్తో పీకే చర్చలు!

ఇవాళ మరోసారి కేసీఆర్తో పీకే చర్చలు!

హైదరాబాద్​, వెలుగు: సీఎం కేసీఆర్‌తో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ (పీకే) భేటీ అయ్యారు. శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రగతిభవన్ చేరుకున్న పీకే, సీఎంతో రాజకీయ చర్చలు జరిపారు. ఆదివారం కూడా పీకే–కేసీఆర్ మధ్య చర్చలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియా తో భేటీ అయిన పీకే, హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో చర్చలు జరుపుతుండటం గమనార్హం. ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం పీకే ఢిల్లీ తిరిగి వెళ్లనున్నట్లు సమాచారం.