- కేబినెట్ విస్తరణ విడతల వారీగా ఉంటది: పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్అక్రమాల చిట్టా సిద్ధమవుతోందని, సరైన సమయంలో ఆధారాలతో సహా బయటపెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ విడతల వారీగా ఉంటుందని పేర్కొన్నారు. ఏ శాఖ ఎవరికీ శాశ్వతం కాదని, ఆశావహులు తమకు నచ్చిన శాఖలపై ఆశలు పెట్టుకోవడం సహజమేనని చెప్పారు. శనివారం సెక్రటేరియెట్లో మీడియాతో ఆయన చిట్చాట్చేశారు.
త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని, సమ్మర్ తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ధరణి సమస్యలకు భూ-భారతితో శాశ్వత పరిష్కారం లభిస్తుందని, అసైన్డ్ భూములపై వస్తున్న ఫిర్యాదులను త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పారు.

