పీఎం టూర్‌‌ను రాజకీయం చేయొద్దు

పీఎం టూర్‌‌ను రాజకీయం చేయొద్దు

హైదరాబాద్, వెలుగు: ముచ్చింతల్‌లో సమతామూర్తి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ పర్యటనను రాజకీయ కోణంలో చూడొద్దని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రులు చేసిన కామెంట్లను ఆదివారం ఆయన ఓ ప్రకటనలో తప్పుబట్టారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడటం ప్రతిపక్షాల దిగజారుడు సంస్కృతికి నిదర్శనమన్నారు. పవిత్ర కార్యక్రమంపై రాజకీయాలు చేయడం మంత్రి కేటీఆర్, కాంగ్రెస్, టీఆర్‌‌ఎస్ నేతలు, నాయకులకు తగదన్నారు. మోడీ పాలనను శ్రీరాముడి పాలనతో చిన జీయర్ స్వామి పోల్చారని గుర్తు చేశారు.