ఇవాళ (ఆగస్టు 18 )ఆర్టీసీ కార్గోలో వేలం

ఇవాళ (ఆగస్టు 18 )ఆర్టీసీ కార్గోలో వేలం

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గోలో క్లెయిమ్​చేయని పార్శిళ్లను వేలం వేస్తున్నట్టు కూకట్​పల్లి డిపో మేనేజర్​సునీత తెలిపారు. కూకట్​పల్లి డిపోలో కార్గోలో పార్శిల్స్​తీసుకెళ్లాల్సిందిగా వినియోగ దారులకు ఫోన్​ద్వారా సమచారం ఇచ్చినా స్పందన రాకపోవడంతో మంగళవారం వేలం వేయనున్నట్టు పేర్కొన్నారు. 

డిపో ఆవరణలో మధ్యాహ్నం 2గంటల నుంచి జరిగే వేలంలో ఆటోమొబైల్ స్పేర్స్​, క్లాత్, ఎలక్ట్రానిక్​, జనరల్, ఎలక్ట్రికల్, స్టేషనరీకి సంబంధించి 24 రకాల వస్తువులను వేలం వేయనున్నట్టు తెలిపారు.