కేసీఆర్పై పోటీకి సిద్ధం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కేసీఆర్పై పోటీకి సిద్ధం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సీఎం కేసీఆర్పై పోటీ చేయడానికి తాను సిద్ధమని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ను చూసి ఇక్కడ ఎవరు బయపడడం లేదని ఆయన తెలిపారు. మే 4వ తేదీ గురువారం ఖమ్మంలోని పొగులేటి శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమైయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పొంగులేటి.. తెలంగాణ వస్తే మంచి జరుగుతదని కలలు కన్న తెలంగాణ బిడ్డల ఆలోచనల్ని, ఆశయాలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. 

కేసీఆర్ వ్కక్తిగత స్వార్థం కోసం పరిపాలన సాగిస్తున్నాడని ధ్వజమెత్తారు పొంగులేటి. కేసీఆర్ ను గద్దేదించేందుకు అందరం ఏకం కావాలన్నారు. నేడు బీజేపీ నాయకులతో ప్రధానంగా చర్చించిన అంశం ఒక్కటే.. కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందించాడమే లక్ష్యమని పొంగులేటి పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీ చేరికల కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందనరావు మరి కొందరు బీజేపీ నాయకులు పొంగులేటితో భేటీ అయ్యారు.

https://youtu.be/FBMG5EqUpw0