సీఎం కేసీఆర్తో పొన్నాల లక్ష్మయ్య భేటీ

సీఎం కేసీఆర్తో పొన్నాల లక్ష్మయ్య  భేటీ

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన  మాజీ మంత్రి  పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.  మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకు  పొన్నాల ప్రగతి భవన్ లో సీఎం  కేసీఆర్ తో సమావేశం అయ్యారు.  

రెండు రోజుల క్రితం  పొన్నాల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం  మంత్రి కేటీఆర్ ఆయన నివాసానికి వెళ్లి పొన్నాలను  బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.  కేసీఆర్ తో భేటీ ఆనంతరం నిర్ణయం తీసుకుంటానని పొన్నాల తెలిపారు. 

పొన్నాలకు పార్టీలో సుముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. 2023  అక్టోబర్  16 జనగామలో  జరిగే బహిరంగ సభలో పొన్నాల.. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారని తెలుస్తోంది.