రోడ్డు విస్తరణ పనులకు ప్రధాని రావాలా? : పొన్నాల

రోడ్డు విస్తరణ పనులకు ప్రధాని రావాలా? : పొన్నాల

హైదరాబాద్, వెలుగు: రోడ్డు విస్తరణ పనుల ప్రారంభానికి మోదీ వరంగల్​ దాకా రావా లా? అని పీసీసీ మాజీ చీఫ్​ పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. ‘ప్రధాని అధికారిక కార్యక్రమాల కోసం వస్తున్నారా? పార్టీ కార్యక్రమాల కోసమా’ అని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ప్రజా ధనంతో పర్యటనలు చేస్తారా? అని నిలదీశారు.

 ‘వరంగల్​కు తొమ్మిదేండ్లలో కేంద్రం ఏం చేసిందని ప్రధాని వస్తున్నారు. కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీ ఏమైందో సమాధానం చెప్పాలి. ప్రధాని ముందు కేసీఆర్​తల వంచి.. మాకేమీ వద్దు.. మీ ప్రేమ చాలు అన్నారు’ అని పొన్నాల అన్నారు.