మహిళా సమాఖ్యల ద్వారా 600 బస్సులు కొంటాం... మహిళలను ఓనర్లను చేస్తాం : పొన్నం ప్రభాకర్

మహిళా సమాఖ్యల ద్వారా 600 బస్సులు కొంటాం... మహిళలను ఓనర్లను చేస్తాం : పొన్నం ప్రభాకర్
  • మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు, ఆఫీసర్ల రివ్యూలో మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్​, వెలుగు : మండల మహిళా సమాఖ్యల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేసి, మహిళలను ఓనర్లను చేస్తామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌‌‌లో మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు, ఆఫీసర్లతో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. మహిళల కోసం పథకాలు తీసుకొచ్చి వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇందులో భాగంగానే ఇందిరా మహిళా శక్తి పథకాన్ని తీసుకొచ్చామన్నారు. 270 రోజుల్లో 85 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేశారన్నారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా 43 వేల మంది ఆర్టీసీ కార్మికులు నిరంతరం పనిచేసి, రికార్డు స్థాయిలో 64 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చారని చెప్పారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి మహర్దశ వచ్చిందన్నారు. సర్కార్‌‌‌‌ స్కూళ్లు, అంగన్​వాడీ స్టూడెంట్లకు యూనిఫామ్‌‌‌‌ కుట్టే బాధ్యత, మీ సేవా కేంద్రాల నిర్వహణను సైతం మహిళా సంఘాలకే అప్పగించామన్నారు. ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళలకే ఇస్తామని చెప్పారు. గ్రామ సమాఖ్యల ద్వారా స్టీల్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లను ఏర్పాటుచేస్తామని, ఇందుకు అవసరమైన లోన్లను బ్యాంకుల ద్వారా ఇప్పిస్తామన్నారు.

హుస్నాబాద్‌‌‌‌ నియోజకవర్గంలో 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌‌‌‌ కారిడార్‌‌‌‌ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.43.83 కోట్ల బ్యాంక్‌‌‌‌ లింకేజీ రుణాన్ని అందజేశారు. సమావేశంలో సిద్దిపేట, కరీంనగర కలెక్టర్లు మనుచౌదరి, పమేలా సత్పతి, ఫిషరీస్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ ప్రియాంక అల, సిద్దిపేట అడిషనల్‌‌‌‌ కలెక్టర గరీమా అగర్వాల్‌‌‌‌, హుస్నాబాద్‌‌‌‌ ఆర్డీవో రామ్మూర్తి పాల్గొన్నారు.