లోక కల్యాణానికి యాగాలు చేయడం అభినందనీయం : పొన్నం ప్రభాకర్

లోక కల్యాణానికి యాగాలు చేయడం అభినందనీయం : పొన్నం ప్రభాకర్

ముషీరాబాద్, వెలుగు :  లోక కళ్యాణంతో పాటు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని యాగాలు చేయడం  అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శ్రీ సిద్దేశ్వర పీఠం కుర్తాళం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ సిద్దేశ్వర నంద భారతి మహాస్వామి 88వ అవతరణ ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కోటి ప్రత్యంగిర మహా యాగంలో భాగంగా గురువారం శ్రీ సరస్వతి బ్రహ్మ దేవ కల్యాణోత్సం వైభవంగా నిర్వహించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం శ్రీ సిద్దేశ్వరానంద భారతి పొన్నం ప్రభాకర్​కు మెమోంటోలు, తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. పీఠం ప్రతినిధులతో పాటు భక్తులు పాల్గొన్నారు.