తీర ప్రాంతాలకు ముప్పు ఉంది : రాజ్ నాథ్

తీర ప్రాంతాలకు ముప్పు ఉంది : రాజ్ నాథ్

భారత తీర ప్రాంతానికి ముప్పు ఉందని తెలిపారు రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్. ఇటీవలే తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లో జర్నీ చేసిన రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఇప్పుడు యుద్ధనౌక INS విక్రమాదిత్యలో ప్రయాణిస్తున్నారు. 24 గంటల పాటు ఆయన యుద్ధనౌకలోనే గడపనున్నారు. ఉదయం యుద్ధనౌకను పరిశీలించారు రాజ్ నాథ్.

తర్వాత సిబ్బందితో కలిసి యోగా చేశారు. దేశానికి నేవీ చేస్తున్న సేవలను కొనియాడారు రాజ్ నాథ్. తాను ఢిల్లీ తిరిగి వెళ్లాక.. INS విక్రమాదిత్యలో పనిచేస్తున్న వారి కుటుంబసభ్యులందరికి లేఖ రాస్తానని చెప్పారు.