
మీర్పేటలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వ్యక్తిగత కారణాలతో మనస్థాపం చెందిన పోస్టల్ ఉద్యోగి సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సురేష్ (38) పోస్ట్ ఆఫీస్ MMS వాన్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు చూస్తుండగా బెడ్ రూమ్ లోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇంట్లో ఉన్న ఫర్నీచర్ కు మంటలు అంటుకోవడంతో పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. .