పాక్లో పెరుగుతున్న దారిద్ర్యం.. ఆరేండ్లలో 6.9 శాతం పెరుగుదల

పాక్లో పెరుగుతున్న దారిద్ర్యం.. ఆరేండ్లలో 6.9 శాతం పెరుగుదల

ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌: పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లో పేదరికం గత ఆరు సంవత్సరాల్లో గణనీయంగా పెరిగింది. ఆ దేశ జనాభాలో సుమారు 28.8 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. పాకిస్తాన్​లో పేదరిక అంచనాలపై అధ్యయనం చేసిన ప్రభుత్వ కమిటీ ఈ విషయాన్ని తేల్చింది. 

పాకిస్థాన్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ఎకనామిక్స్ (పీఐడీఈ) మాజీ జాయింట్ డైరెక్టర్  జీఎం ఆరిఫ్ నాయకత్వంలో ఈ అధ్యయనం కొనసాగింది. ఈ నివేదికను అధికారికంగా విడుదల చేయలేదు. అయితే, స్థానిక మీడియా కథనాల ప్రకారం.. 2018–19లో పేదరికం 21.9 శాతంగా ఉండగా, 2024–25 నాటికి అది 28.8 శాతానికి చేరింది. 

అంటే సుమారు 6.9% పెరుగుదల నమోదైంది. గత ఆరేండ్లలో మూడుసార్లు దేశంలో ఐఎంఎఫ్ రూల్స్​ అమలు చేయడం, కరోనా ఎఫెక్ట్, ధరల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం, తక్కువ జీడీపీ వృద్ధి రేట్లు, రెండు భారీ వరదలు, గోధుమలకు మద్దతు ధరల రద్దు.. వంటి అంశాలు పేదరికం పెరగడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.