
భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా తానూర్మండలం ఝరి(బీ) గ్రామానికి చెందిన దివ్యాంగుడు రాథోడ్ఉదయ్కుమార్పట్టుదలతో క్రీడల్లో రాణిస్తూ జాతీయస్థాయిలో ప్రతిభ చాటుతున్నా.. పేదరికం అతడిని వెనక్కి లాగుతోంది. విశేషంగా రాణిస్తూ జాతీయ స్థాయి జట్టుకు ఎంపికైనా పేదరికంతో క్రీడల్లో పాల్గొనలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఉదయ్కుమార్ పుట్టినప్పుడే ఎడమ చేతి మూడు వేళ్లు లేవు.
అయినా వైకల్యాన్ని లెక్కచేయకుండా ఫుట్బాల్లో రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. జాతీయ ఎంపీటీ ఫుట్బాల్ ఫెడరేషన్ఆధ్వర్యంలో సెప్టెంబర్26 నుంచి అక్టోబర్4 వరకు ఇరాన్లోని తెహ్రాన్ లో జరిగే వెస్ట్ ఏషియన్ ఎంపీటీ ఫుట్బాల్ఛాంపియన్షిప్పోటీల్లో పాల్గొనేందుకు భారత్ జట్టు తరఫున ఎంపికయ్యాడు.
పారాయంప్యూటీ ఫుట్బాల్ఛాంపియన్షిప్లో ప్రతినిత్యం వహించేందుకు సుమారు రూ.2 లక్షల వరకు ఫీజు కట్టాల్సి ఉంది. బీద కుటుంబం కావడంతో అంత డబ్బు కట్టలేని స్థితిలో ఉన్న ఉదయ్కుమార్..ఈ టోర్నీలో పాల్గొనేందుకు వెనుకడుగు వేస్తున్నాడు. తాను జాతీయ జట్టు తరఫున ఆడేందుకు ఆర్థిక సాయమందించాలని వేడుకుంటున్నాడు. దాతలు 8688960438 నంబర్కు గూగుల్ పే, ఫోన్పే చేయాలని కోరుతున్నాడు.