
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. 2023 తెలంణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకే రోజు 600 మంది ఫోన్లు ట్యాప్ చేయడం కలకలం రేపుతోంది. నవంబర్ 15న అంటే నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజున SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు,ప్రణీత్ రావు టీం 600 మంది ఫోన్లను టాప్ చేసింది.
SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మావోయిస్టుల పేరు చెప్పి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడు. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారని మావోయిస్టుల సాను భూతిపరుల పేర్లతో ట్యాపింగ్ చేశాడు. రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్ల మీద నెంబర్లు ఇచ్చాడు ప్రభాకర్ రావు. సాధారణ ఎన్నికల్లో మావోయిస్టులు యాక్టివ్ అయ్యారని కమిటీకి చెప్పాడు. మావోయిస్టుల పేరుతో అధికార ,ప్రతిపక్ష ,వ్యాపార రంగానికి చెందిన వారితో పాటు జర్నలిస్టుల ఫోన్లు టాప్ చేశాడు.
ALSO READ | 650 మంది కాంగ్రెస్ లీడర్ల ఫోన్లు ట్యాప్: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు కీలక నాయకుల ఫోన్లు టాప్ చేసింది ప్రభాకర్ టీం. రేవంత్ రెడ్డి, ఈటెల, అరవింద్ , రఘునందన్ ఫోన్ లు. అప్పటి BRS అధికారపక్ష నాయకుల ఎమ్మెల్యేల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేశారు. ట్యాపింగ్ కోసం ఏకంగా ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేశాడు ప్రభాకర్ రావు. శ్రవణ్ రావు ద్వారా సమాచారం తెప్పించుకొని ప్రణీతరావుకు ఇచ్చాడు ప్రభాకర్ రావు. ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భుజంగరావుకు ఇచ్చాడు ప్రణీత్. భుజంగరావు నేరుగా బీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసి స్థితిగతులను ఎప్పటికప్పుడు వివరణ కోరేవాడు.
ప్రతిపక్ష నాయకుల వైపు ఎవరైనా వెళ్తుంటే వెంటనే అధికారపక్ష నేతలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చేవాడు భుజంగరావు. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై నిఘా పెట్టి పోలీసులతో దాడులు చేయించేవారు. వ్యాపారవేత్తలపై దాడుల కోసం టాస్క్ ఫోర్స్ OSD రాధా కిషన్ రావును వాడారు ప్రభాకర్ రావు. డబ్బులు ఎవరైనా తీసుకువెళ్తుంటే వెంటనే ట్యాప్ చేసి పట్టుకున్నారు అధికారులు.
ఈ కేసులో ఇప్పటికే విచారణకు పలు మార్లు సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు,ప్రణీత్ రావు రేపు(జూన్ 18) సిట్ విచారణకు హాజరుకానున్నారు.ప్రణీత్ రావు ఫోన్ డేటాలో 400 ఫోన్ ట్యాపింగ్ కాల్స్ బయటపడటం కలకలం రేపుతోంది.