SalaarCease Fire Trailer : నీ కోసం ఎరైనా అవుతా..సొరైనా అవుతా..

 SalaarCease Fire Trailer : నీ కోసం ఎరైనా అవుతా..సొరైనా అవుతా..

ఇండియన్ సినీ లవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీస్ లలో సలార్ (Salaar) ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabahs) హీరోగా వస్తున్న సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ తోపాటు, ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ వచ్చారు. నేటితో ట్రైలర్ ఎదురుచూపులకు సలార్ ఫెస్టివల్ మాజా తీసుకొచ్చింది. 

లేటెస్ట్గా ప్రభాస్ సలార్‌ పార్ట్‌1: సీజ్‌ఫైర్‌ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ 3 నిమిషాల 47 సెకన్ల భావోద్వేగంతో, ప్రభాస్ గంభీరమైన పోరాట సన్నివేశాలతో ఆడియన్స్ను కదిలించేస్తుంది. ట్రైలర్ చూస్తుంటే..ప్రభాస్‌ మూవీ నుంచి ఫ్యాన్స్ కోరుకునే అన్ని మాస్‌ అంశాలు పుష్కలంగా మేళవించి ‘సలార్‌’ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.  

ట్రైలర్ ఎలా ఉంది?


'సలార్' టీజర్లో ప్రభాస్ ముఖం చూపించకుండా ఎలివేషన్ ఇచ్చారు. ట్రైలర్‌తో మాత్రం దాదాపు అందరూ మెయిన్ లీడ్స్‌ని చూపించేశారు. ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య ఉన్న స్నేహాన్ని చూపిస్తూ..ఎమోషన్స్తో కట్టిపడేసేలా సీన్స్ ఆకట్టుకుంటున్నాయి.ఇక ట్రైలర్ చివర్లో ప్రభాస్‌ యాక్షన్తో అదరగొట్టేశాడు.

సలార్ కథేంటి?

ఖన్సార్ అనే ప్రాంతాన్ని రాజమన్నార్ (జగపతిబాబు) అనే వ్యక్తి ఏలుతుంటాడు. ఇతడి కొడుకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్).  ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ స్నేహితులుగా ఈ ట్రైలర్‌లో చూపించారు మేకర్స్.  ఖాన్సార్ సామ్రాజ్యం కోసం జరిగే పోరాటాలే ఈ మూవీ ప్రధాన కథగా ఉన్నట్టు అర్థమవుతోంది. చిన్నతనం నుంచే దేవ (ప్రభాస్), వరదరాజ్ మన్నార్ (పృథ్విరాజ్ సుకుమారన్) మధ్య స్నేహం ఉంటుంది. అయితే, చిన్నతనంలోనే వారు విడిపోతారు. 'నీ కోసం ఎరైనా అవుతా..సొరైనా అవుతా..నీ ఒక్కడి కోసం..నువ్వు ఎప్పుడు పిలిచినా ఇక్కడికి వస్తా' అని చెప్పి దేవ వెళ్లిపోతాడు.

వెయ్యేళ్ల క్రితం క్రూరమైన బందిపోట్లు పాలించిన ఖాన్సార్..కోట ఆ తర్వాత సామ్రాజ్యం అయిందని ట్రైలర్లో ఉంది. ఇప్పుడు కూడా ఖాన్సార్ కుర్చీ కోసం కుతంత్రాలు జరిగేవంటూ వాయిస్ ఓవర్ కొనసాగింది. ఖాన్సార్‌ను పాలించే రాజమన్నార్‌గా జగపతి బాబు కనిపించారు. తన కుమారుడు వరదరాజ్‍ను దొరగా తన ప్లేస్‍లోకి రావాలని కోరుకుంటాడు. అయితే, ఇప్పటికే వరదరాజ్‍ను చంపేందుకు కొన్ని గ్రూప్‍లు కుట్ర పన్ని దాడి చేస్తాయి. ఖాన్సార్‌ను స్వాధీనం చేసుకుంటాయి. శత్రువులుగా మారిన ఇద్దరు మిత్రుల కథతో ఈ చిత్రం తెరకెక్కించినట్లు ఇదివరకే డైరెక్టర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

రవి బాసృర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్బంప్స్ తెప్పించేలా ఇరగదీశాడు. చాలా కాలం నుంచి అసలైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ కు సలార్తో ఆకలి తీరడం కన్ఫమ్ అనేలా ప్రశాంత్ నీల్ తెరకెక్కించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. 

ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు, శ్రియ రెడ్డి, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.