హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి సినిమాగా ఆదిపురుష్ తెరకెక్కనుంది. బాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో పట్టాలెక్కనున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఫిల్మ్కు సంబంధించి కాస్ట్, బడ్జెట్ మీద పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం.. ఆదిపురుష్ను రూ.400 కోట్ల బడ్జెట్తో తీయనున్నారని సమాచారం. కరోనా కారణంగా చాలా మంది మేకర్స్ సినిమాల బడ్జెట్లను తగ్గిస్తున్నారు. అయితే ఆదిపురుష్ మేకింగ్ విషయంలో వెనక్కి తగ్గొద్దని, ముందు అనుకున్న బడ్జెట్తోనే తెరకెక్కించాలని ఓం రౌత్ నిర్ణయించారని తెలిసింది. బడ్జెట్లో ఎక్కువ భాగం వీఎఫ్ఎక్స్ వర్క్కే ఖర్చు చేయనున్నారు. ఆదిపురుష్ సినిమా మొత్తాన్ని గ్రీన్ మ్యాట్ టెక్నాలజీతోనే తీయనున్నారు. ఇందుకోసం అవతార్, స్టార్ వార్స్ లాంటి క్రేజీ హాలీవుడ్ ప్రాజెక్టులకు పని చేసిన వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్తో మూవీ మేకర్స్ సంప్రదిస్తున్నారని సమాచారం. ఆది పురుషుడైన రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించనున్న ఈ సినిమాలో కనిపించనున్న మిగతా నటీనటుల వివరాలను సినీ యూనిట్ త్వరలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
Celebrating the victory of good over evil! #Adipurush#Prabhas @ItsBhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/zx5NXseX0G
— Om Raut (@omraut) August 18, 2020
