ఇబ్రహీంపట్నం బాధితులను పరామర్శించిన కేఏ పాల్

ఇబ్రహీంపట్నం బాధితులను పరామర్శించిన కేఏ పాల్

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి పంజాగుట్ట నిమ్స్లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంపట్నంకు చెందిన 11 మంది మహిళలను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పరామర్శించారు. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు ఒక్కొక్కరికి రూ.10,116 చెక్కులను పాల్ అందజేశారు. భయాందోళలకు గురికావద్దని  ధైర్యం చెప్పారు.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించడం వంటి ఘటన జరగడం దురదృష్టకరమని కేఏ పాల్ అన్నారు. 17మంది హాస్పిటల్ లో చేరగా.. ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ఒత్తిడి కారణంగా వైద్యులు, సిబ్బంది ఒకింత అసహనం వ్యక్తం చేసినా బాధపడకుండా వారికి సహకరించాలని సూచించారు. దేవుడి దయతో బాధితులంతా త్వరగా కోలుకుని సాధారణ జీవితం కొనసాగిస్తారని ఆకాంక్షించారు.