
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆయా ప్రాంతాల జనం ఎదుర్కొంటున్న సమ్యల పరిష్కారమే లక్ష్యంగా బల్దియా అధికారులు సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జీహెచ్ఎంసీ హెడ్డాఫీసుతో పాటు జోనల్, సర్కిల్ ఆఫీసుల్లోనూ ప్రజావాణిని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఫోన్ ద్వారా జనం తమ ప్రాంతాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావాలని కోరారు. కమిషనర్ ఆయా సమస్యలపై స్పందిస్తారన్నారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదు చేయాలనుకునే వారు 04023222182 నంబర్కు ఫోన్చేసి ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవచ్చన్నారు. అలాగే ఎవరైనా తమ దరఖాస్తులను సైతం ఆయా ప్రాంతాల్లోని సర్కిల్ ఆఫీసుల్లోనూ ఇవ్వొచ్చన్నారు.