అన్ని సమస్యలు పరిష్కరిస్తాం : దివ్య

అన్ని సమస్యలు పరిష్కరిస్తాం : దివ్య

పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావు​ఫూలే  ప్రజాభవన్​లో శుక్రవారం  ప్రజావాణికి 1,203 ఫిర్యాదులు వచ్చాయి.  వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ సమస్యలపై అర్జీలను అందజేశారు. గురుకుల నియామకాల్లో అన్యాయం జరిగిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. తమ సమస్య పరిష్కరించాలంటూ ప్రజాభవన్​ ఆవరణలో బైఠాయించారు.  

ఆందోళన చేయాలనుకుంటే  సంబంధిత కార్యాలయం వద్ద చేసుకోవాలని పోలీసులు పంపించారు. రేషన్​కార్డులు, ఇండ్లు, పింఛన్లు ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేశారు. ప్రజావాణి నోడల్​ అధికారి దివ్య దేవరాజన్​ ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.