బీఆర్ఎస్ వల్లే రహ్మత్ అత్మహత్య : ప్రకాశ్ జవదేకర్

బీఆర్ఎస్ వల్లే రహ్మత్ అత్మహత్య : ప్రకాశ్ జవదేకర్

న్యూఢిల్లీ, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌‌పల్లికి చెందిన గ్రూప్స్ అభ్యర్థి రహ్మత్ ఆత్మహత్యకు బీఆర్ఎస్సే బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జ్ ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. ఉద్యోగ పరీక్షలను టీఎస్ పీఎస్సీ వాయిదా వేయడం, వరుస పేపర్ లీకేజీలతోనే రహ్మత్ నిరాశకు గురయ్యాడని చెప్పారు. బుధవారం ట్విట్టర్(ఎక్స్)లో ప్రకాశ్ జవదేకర్ బీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు చేశారు.

 ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు, గ్రూప్స్ పరీక్షల బాధితుల నోరు మూసే ప్రయత్నాలను ఆపి, టీఎస్ పీఎస్సీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలను అంగీకరించాలని హితవు పలికారు. తన పోస్ట్ కు రహ్మత్ ఫోటోతో పాటు మీడియాలో వచ్చిన కథనాలను జోడించారు.