ఓడిపోయినప్పుడే ఈవీఎంలపై కాంగ్రెస్‌కు అనుమానాలు: ప్రకాశ్ జవదేకర్​

ఓడిపోయినప్పుడే ఈవీఎంలపై కాంగ్రెస్‌కు అనుమానాలు: ప్రకాశ్ జవదేకర్​

హైదరాబాద్, వెలుగు: ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఈవీఎంలపై అనుమానాలు వస్తాయని బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. ఈవీఎంలపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో జవదేకర్‌‌ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని తెలిసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరికి ఓటేసినా బీజేపీకే పడుతుందంటూ కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నదన్నారు.