నేనైతే బాగా చేసుండేవాడిని.. ఆదిపురుష్ మూవీపై ప్రశాంత్ కామెంట్స్ వైరల్

నేనైతే బాగా చేసుండేవాడిని.. ఆదిపురుష్ మూవీపై ప్రశాంత్ కామెంట్స్ వైరల్

ఆదిపురుష్(Adipurush) సినిమాపై హనుమాన్(HanuMan) దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma) షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆదిపురుష్ సినిమా గురించి, ఆ సినిమా రిజల్ట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ హనుమాన్. తేజ సజ్జ హీరోగా చేసిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

కేవలం తెలుగులోనే కాకుండా.. నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు మెస్మరైజ్ అవుతున్నారు. దీంతో నార్త్ లో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా.. దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఆయనకు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా గురించి ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమాలో కొన్ని సీన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. వాటిని తెరకెక్కించిన విధానం నన్ను ఆశ్చర్య పరిచింది. కానీ, కొన్ని సీన్స్ మాత్రం అస్సలు నచ్చలేదు. ఆ సీన్స్ ని నేనైతే ఇంకా బాగా చేసుండేవాడిని అనిపించింది. నాకే కాదు.. ఏ ఫిల్మ్ మేకర్ కి అయినా అలాగే అనిపిస్తుంది.. అంటూ  ఆదిపురుష్ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక ప్రశాంత్ వర్మ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హనుమాన్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రశాంత్ త్వరలోనే తరువాతి సినిమా అధీర ను మొదలుపెట్టనున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమాలో కొత్త హీరో కళ్యాణ్ దాసరి నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా 2024 ఎండింగ్ కి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ.. అధీర తో ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తారో చూడాలి.