బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం రావాలని పూజలు

బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం రావాలని పూజలు
  • దర్గాలో, తుల్జా భవాని టెంపుల్‌‌లో బీఆర్‌‌‌‌ఎస్ నేతల ప్రార్థనలు

పద్మారావునగర్, వెలుగు :  రాష్ర్టంలో మరోసారి బీఆర్ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి  రావాలని, సనత్‌‌నగర్‌‌‌‌ ఎమ్మెల్యేగా తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ మూడో సారి గెలిచి, హ్యాట్రిక్ సాధించాలని వేడుకుంటూ బన్సీలాల్ పేటకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు నాంపల్లిలోని యూసుఫ్​బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  డివిజన్​ మైనార్టీ నాయకులు మహ్మాద్​ అబ్బాస్​, షేక్​ సల్మాన్​, మహ్మాద్​ జుబేర్​, అజార్​, షేక్​ షౌకాత్​, షేక్​ ముజీబ్​ పాల్గొన్నారు.

శ్రీ తుల్జాభవాని సన్నిధిలో పూజలు

బన్సీలాల్​ పేటకు చెందిన సీనియర్​ బీఆర్​ఎస్​ నాయకులు కుమార్​ యాదవ్​, రాజేందర్‌‌‌‌లు శనివారం మహారాష్ట్రలోని తుల్జాపూర్‌‌‌‌ క్షేత్రానికి వెళ్లి, అక్కడి తుల్జా భవాని ఆలయాన్ని సందర్శించారు. తెలంగాణలో  బీఆర్ఎస్​ ప్రభుత్వం రావాలని,  సనత్‌‌నగర్​ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ భారీ మెజార్టీతో  గెలవాలని అమ్మవారి సన్నిధిలో పూజలు చేశారు.