- దర్గాలో, తుల్జా భవాని టెంపుల్లో బీఆర్ఎస్ నేతల ప్రార్థనలు
పద్మారావునగర్, వెలుగు : రాష్ర్టంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, సనత్నగర్ ఎమ్మెల్యేగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మూడో సారి గెలిచి, హ్యాట్రిక్ సాధించాలని వేడుకుంటూ బన్సీలాల్ పేటకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు నాంపల్లిలోని యూసుఫ్బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. డివిజన్ మైనార్టీ నాయకులు మహ్మాద్ అబ్బాస్, షేక్ సల్మాన్, మహ్మాద్ జుబేర్, అజార్, షేక్ షౌకాత్, షేక్ ముజీబ్ పాల్గొన్నారు.
శ్రీ తుల్జాభవాని సన్నిధిలో పూజలు
బన్సీలాల్ పేటకు చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కుమార్ యాదవ్, రాజేందర్లు శనివారం మహారాష్ట్రలోని తుల్జాపూర్ క్షేత్రానికి వెళ్లి, అక్కడి తుల్జా భవాని ఆలయాన్ని సందర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, సనత్నగర్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవాలని అమ్మవారి సన్నిధిలో పూజలు చేశారు.