
జెట్ ఎయిర్వేస్ పరిస్థితి రోజురోజుకు దిగజారి మూసివేత దిశగా అడుగులు వేస్తోంది. ఈ పరిస్థితిపై విజయ్ మాల్యా విచారం వ్యక్తం చేశారు. జెట్ ఈ పరిస్థితికి రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వ వివక్షే కారణమంటూ ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు. ఒకప్పుడు కింగ్ ఫిషర్ జెట్ ఎయిర్ వేస్కు గట్టి పోటీనిచ్చింది. అంత పెద్ద ఎయిర్లైన్స్ ప్రస్తుతం ఈ స్థితిలో చూడాల్సి రావడం బాధాకరంగా ఉందన్నారు. ఎయిరిండియాను బయటపడేసేందుకు మాత్రం రూ. 35 కోట్లు ఖర్చుచేసింది. మేం పోటీ దారులం అయినప్పటికి ఇలాంటి పరిస్థితుల్లో నరేశ్ గోయల్ దంపతులకు సానుభూతి తెలుపుతున్నా. జెట్ కోసం వారెంతో కష్టపడ్డారని మాల్యా అన్నారు. ఈ సందర్భంగా తాను తీసుకున్న అప్పులు 100 శాతం తిరిగి చెల్లిస్తానని చెబుతూనే ఉన్నానని..అయినా పట్టించుకోకుండా తనపై నేరాభియోగాలు వేస్తున్నారన్నారు. తాను అప్పులు చెల్లిస్తానని చెప్పినప్పుడల్లా మీడియా భారత్కు అప్పగించే విషయం గురించి మాట్లాడుతోందన్నారు. తాను లండన్లో ఉన్నా..భారత్లో ఉన్నా అప్పులు చెల్లించేందుకు సిధ్దంగా ఉన్నానని విజయ్ మాల్యా స్పష్టం చేశారు.