గవర్నర్.. ప్రభుత్వానికి, ప్రజలకు ఫ్రెండ్‌‌లా ఉండాలె

గవర్నర్.. ప్రభుత్వానికి, ప్రజలకు ఫ్రెండ్‌‌లా ఉండాలె

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి, ప్రజలకు గవర్నర్ ఒక ‘ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్’ మాదిరిగా ఉండాలని మన రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించా రని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ అన్నారు. గురువారం రాష్ట్రపతి భవన్​లో రాష్ట్రాల గవర్నర్లు, యూటీ ల లెఫ్టినెంట్ గవర్నర్లతో కాన్ఫరెన్స్​లో రాష్ట్రపతి మాట్లాడారు. గవర్నర్లు వారి రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని, ప్రజలతో మంచి సంబంధాలను కొనసాగిం చాలని సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, సేవ కోసమే తాము ఉన్నామని గుర్తుపెట్టుకోవాలన్నా రు. జాతీయ లక్ష్యాల సాధనలో ప్రజలు పాల్గొనేలా చేయడం గవర్నర్ బాధ్యత అని చెప్పారు.