మొక్కలతోనే గ్లోబల్ వార్మింగ్ నివారణ..పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

మొక్కలతోనే గ్లోబల్ వార్మింగ్ నివారణ..పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

పద్మారావునగర్, వెలుగు: మొక్కలు నాటడం ద్వారానే గ్లోబల్​ వార్మింగ్​ను నివారించగలుగుతామని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ ప్రొఫెసర్​ డాక్టర్​ వాణి అన్నారు. స్వచ్ఛతా హీ సేవా- 2025లో భాగంగా సికింద్రాబాద్  గాంధీ హాస్పిటల్​లో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. సూపరింటెండెంట్ మెయిన్​ బిల్డింగ్ అవరణలో పలు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ఆర్​ఎంవో- 1 డాక్టర్​ శేషాద్రి, డాక్టర్​ కళ్యాణ్ చక్రవర్తి, హెల్త్ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​, మహేశ్, సెక్యూరిటీ చీఫ్​ శివాజీ, పవర్​ గ్రిడ్​ సిబ్బంది పాల్గొన్నారు.