బాలి చేరుకున్న మోడీ

బాలి చేరుకున్న మోడీ

ప్రధాని మోడీ ఇండోనేషియా రాజధాని బాలికి చేరుకున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోడీ బాలిలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ఇండోనేషియా ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. ఆ దేశ సంప్రాదాయం ప్రకారం మోడీని స్వాగతించింది. జీ20 సదస్సులో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రపంచ నేతలతో ప్రధాని మోడీ సమావేశమవుతారు.

మంగళవారం నుంచి సదస్సు..
జీ20 సదస్సు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తో పాటు 20 దేశాల, యూరోపియన్ యూనియన్‌లకు చెందిన అధిపతులు  ఈ  సదస్సులో పాల్గొంటారు. కరోనా, ఆర్థిక పునరుద్ధరణ, రష్యా-ఉక్రెయన్ యుద్ధం, ఐరోపా సంక్షోభం, ఇంధన భద్రత, ఆహార భద్రత సవాళ్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం వంటి అనేక అంశాలపై జీ20 దేశాలు రెండు రోజుల చర్చిస్తాయి. 

మోడీకి జీ20 అధ్యక్ష బాధ్యతలు..
వచ్చే ఏడాది జీ20 సదస్సు భారత్ లోని కశ్మీర్లో జరగనుంది. ఇందులో భాగంగా జీ-20 నిర్వహణ బాధ్యతలను ఇండోనేషియా నుంచి భారత్‌ స్వీకరిస్తుంది. ఇండోనేషియా అధ్యక్షుడి నుంచి ప్రధాని మోడీ జీ 20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు.సదస్సు ముగింపు వేళ ఈ ప్రక్రియ జరగనుంది.