న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. ఆయన అధికారిక యూట్యూబ్ చానల్ సబ్స్ర్కైబర్ల సంఖ్య 3 కోట్ల మార్కును దాటింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో అత్యధిక ఫాలోయర్లు ఉన్న గ్లోబల్ లీడర్గా ప్రధాని మోదీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ప్రధాని మోదీ తర్వాతి స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉన్నారు.
అయితే, ఆయనకు మోదీ సబ్స్ర్కైబర్లలో కేవలం నాలుగో వంతు మాత్రమే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పోలిస్తే ప్రధాని మోదీకి ఏడు రెట్లు ఎక్కువ మంది సబ్స్ర్కైబర్లు ఉన్నారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు ఉన్న ఆదరణకు అద్దం పడుతున్నది.
