కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ను పరిశీలించిన మోడీ

కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ను పరిశీలించిన మోడీ
  • నిర్మాణ పనులను పరిశీలించిన ప్రధాని

న్యూఢిల్లీ, వెలుగు: కొత్త పార్లమెంట్ బిల్డింగ్ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి అక్కడికి వెళ్లిన మోడీ.. దాదాపు గంటకు పైగా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ లో ఏర్పాటు చేస్తున్న సౌలతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మికులతో కాసేపు ముచ్చటించారు. ఇంతకుముందు 2021 సెప్టెంబర్ లోనూ మోడీ ఆకస్మికంగా పార్లమెంట్ బిల్డింగ్ పనులను పరిశీలించారు. కాగా, పాత పార్లమెంట్ బిల్డింగ్ పక్కనే నిర్మిస్తున్న కొత్త బిల్డింగ్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. బయటి పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. లోపలి పనులు కూడా అయిపోవచ్చాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొత్త పార్లమెంట్ లో మన సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన అంశాలపై 
పెయింటింగ్స్ వేయించినట్లు సమాచారం.