పంజాగుట్ట, వెలుగు: నగరంలో పర్యావరణ అనుకూల ఆరోగ్య సేవలపై అవగాహన పెంచే లక్ష్యంగా ‘హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ ప్లాట్ఫాం’ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొ. బీరప్ప తెలిపారు.
మంగళవారం నిమ్స్ ఆస్పత్రిలోని సమావేశ మందిరంలో ఈ సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. జూన్ 20న హైటెక్ సిటీలోని యశోదా ఆస్పత్రిలో నిర్వహించనున్న ఈ సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వైద్య నిపుణులు హాజరై పర్యావరణ పరిరక్షణతో కూడిన వైద్య విధానాలపై చర్చించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడర్షిప్ ప్లాట్ఫాం అధ్యక్షుడు డా. లింగయ్య, తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు డా. మార్తా రమేశ్ పాల్గొన్నారు.
