ఫోన్ చోరీ..  అకౌంట్ ఖాళీ..రూ.2.99 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

ఫోన్ చోరీ..  అకౌంట్ ఖాళీ..రూ.2.99 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

ఉప్పల్, వెలుగు: ఓ విద్యార్థిని ఫోన్​ను చోరీ చేసిన కేటుగాళ్లు ఆమె బ్యాంక్​అకౌంట్​ నుంచి రూ.2.99 లక్షలు కాజేశారు. ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన బి.రేణుశ్రీ సెల్​ఫోన్ కొన్ని రోజుల క్రితం చోరీకి గురైంది. అనంతరం ఆమె ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ అకౌంట్​నుంచి రూ.2,99,891 మాయమయ్యాయి. ఓటీపీ, బ్యాంక్​వివరాలు ఎవరితోనూ పంచుకోలేదని ఆమె చెప్పింది. బాధితురాలు ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాజిగిరి సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

ఓటీపీలు రాలే.. రూ.2.32 లక్షలు ట్రాన్స్​ఫర్​ 

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఉప్పల్ హిల్స్ కాలనీకి చెందిన మేళ రాధిక బ్యాంక్​అకౌంట్​నుంచి రూ.2.32 లక్షలు కాజేశారు. క్యాష్​ డ్రా చేసేందుకు బ్యాంక్​కు వెళ్లగా.. అకౌంట్​లో కేవలం రూ.16 వేలే ఉన్నట్లు చెప్పారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పరిశీలించగా పలుమార్లు డబ్బు బదిలీ అయినట్లు తేలింది. అయితే, ఈ లావాదేవీలకు సంబంధించి తనకు ఎటువంటి ఓటీపీలు రాలేదని బాధితురాలు వాపోయారు. ఆదివారం మల్కాజిగిరి సైబర్​క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.