జీడిమెట్ల, వెలుగు: గంజాయి, మద్యం మత్తులో ఒంటరి ప్రయాణికులే లక్ష్యంగా దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి మంగళవారం వెల్లడించారు.
బేగంపేటకు చెందిన బి.సాయికిరణ్, సీహెచ్ నవీన్, గుగులోత్ అనిల్తోపాటు సాయితేజ, పండు, ఈశ్వర్ గంజాయి, మద్యానికి బానిసయ్యారు. వీరంతా ప్రతిరోజూ బేగంపేట్, ప్రకాశ్నగర్ పరిసర ప్రాంతాల్లోని వైన్ షాపుల వద్ద కలుసుకునేవారు. ఈ క్రమంలో వీరి మధ్య స్నేహం పెరిగి, జల్సాల కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే వారిపై దాడులు చేసి దోచుకోవడం ప్రారంభించారు. ఈ నెల 14న రాత్రి హెచ్ఎంటీ ఖాళీ ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తున్న రాకేశ్ శర్మ, అతని మిత్రుడు హరీశ్ రెడ్డిని అడ్డగించి తీవ్రంగా కొట్టారు.
అనంతరం వారి వద్ద నుంచి 7.5 గ్రాముల బంగారు గొలుసు, వన్ప్లస్ ఫోన్ను లాక్కెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో సీసీ కెమెరాల ఆధారంగా సాయికిరణ్, నవీన్, అనిల్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సాయితేజ, పండు, ఈశ్వర్కోసం గాలిస్తున్నారు.
