తెలంగాణలో నవంబర్ 25, 26, 27 తేదీల్లో ప్రధాని మోదీ టూర్

తెలంగాణలో నవంబర్ 25, 26, 27 తేదీల్లో ప్రధాని మోదీ టూర్

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 25, 26, 27 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారని బీజేపీ రాష్ట్ర నేతలు తెలిపారు. 25న కరీంనగర్, 26న నిర్మల్‌ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని చెప్పారు. 27న హైదరాబాద్‌లో రోడ్డు షో నిర్వహిస్తారని తెలిపారు. అలాగే, ఈ నెల 20 నుంచి 25 మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్డు షోలు నిర్వహించేందుకు స్టేట్‌ బీజేపీ నేతలు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు.

అలాగే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు ఆ రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు.