హైదరాబాద్, వెలుగు: డైనమిక్ సిటీకి వచ్చానంటూ ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకోగానే ఈ ట్వీట్ చేశారు. ‘‘డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై సమావేశాల్లో చర్చిస్తాం’’ అని తెలుగులో ట్వీట్ చేశారు. తనకు స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, నేతల ఫొటోలను అదే ట్వీట్తో పోస్టు చేశారు. గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్ బేగంపేట ఎయిర్పోర్టులో మోడీకి స్వాగతం పలికారు. అక్కడి నుంచి మాదాపూర్ లోని హెచ్ఐసీసీకి ఆర్మీ హెలికాప్టర్లో ప్రధాని బయల్దేరారు. హెచ్ఐసీసీ వద్దకు ఆయన చేరుకోగానే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , ఎంపీ లక్ష్మణ్ , జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీలు జితేందర్రెడ్డి, విజయశాంతితో పాటు పలువురు నేతలు స్వాగతం పలికారు. అనంతరం నోవాటెల్ హోటల్కు వెళ్లిన మోడీ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యారు.
డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న @BJP4India నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం. pic.twitter.com/wOrG9GvabO
— Narendra Modi (@narendramodi) July 2, 2022