అంతారం ప్రాజెక్టును సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రటరీ

అంతారం ప్రాజెక్టును సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రటరీ

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి  జిల్లా షాబాద్​ మండలంలోని అంతారం మిషన్ భగీరథ ప్రాజెక్టును రాష్ట్ర పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ శుక్రవారం సందర్శించారు. ఈ ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎక్కడికి సరఫరా అవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం నుంచి కమ్మదనం మీదుగా అంతారానికి నీళ్లు వస్తున్నాయని, ఇక్కడి నుంచి చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాలకు తాగునీరు సరఫరా అవుతున్నట్లు సిబ్బంది వివరించారు.