ఏపీలో ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా

ఏపీలో ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కావలిలోని చలంచర్ల దగ్గర ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. వేగంగా ప్రయాణిస్తూ ఒక్కసారిగా అదుపుతప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30 మంది విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను హాస్పిటల్ కు తరలించారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. బస్సు వేగంగా దూసుకెళ్లి పల్టీ కొట్టిందని చెబుతున్నారు. విద్యార్థుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.