
మొదట్లో హీరోయిన్లుగా వెలిగిన చాలామంది అవకాశాలు తగ్గాక..క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంటారు. హీరోయిన్ ప్రియమణి (Priyamani) కూడా అదే చేసింది. అయితే మిగతా వారిలా కాకుండా ఇపుడు జెట్ స్పీడులో దూసుకెళ్తోంది. మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ రావడంతో తన టాలెంట్ని గతంలో కంటే ఎక్కువగా ప్రూవ్ చేసుకునే చాన్స్ దొరుకుతోంది ప్రియమణికి. నారప్ప, భామాకలాపం, విరాటపర్వం, మొన్నటికి మొన్న వచ్చిన జవాన్,ఆర్టికల్ 370 లోని తన పాత్రలే అందుకు ఉదాహరణ.
రీసెంట్గా ప్రియమణి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. కార్తీ హీరోగా తెరకెక్కిన ‘పరుతివీరన్’(Paruthiveeran) సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ టైంలో ఉన్న పరిస్థితులను వివరించింది.
2006లో పరుతివీరన్ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు..క్యారవ్యాన్ వంటి లేటెస్ట్ సౌకర్యం లాంటివి అప్పట్లో ఏమీ లేవు. అప్పుడు పరుతివీరన్ మధురైలో షూటింగ్ జరిగింది. దాంతో పాటు తమిళనాడులోని కొన్ని పల్లెటూళ్లలో కూడా షూట్ చేశాం. అలాంటి టైములో రెస్ట్ రూమ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇక అక్కడ ఉండేవాళ్ల ఇళ్లకు వెళ్లి రెస్ట్ రూమ్ ఉపయోగించాల్సి వచ్చింది. ఇంకొన్ని సార్లు అలాంటి సౌకర్యం కూడా లేకపోయేసరికి ఓపెన్ గా వెళ్లాల్సి వచ్చేది’’ అని ప్రియమణి తెలిపారు.
ALSO READ :- మెదక్ బరిలో హరీశ్ రావు.!
అయితే ‘పరుతివీరన్’ సినిమా విషయానికి వస్తే..కార్తీ నటించిన ఫస్ట్ ఫిల్మ్. 2007లో రిలీజైన ఈ మూవీ ఓ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రియమణి నటనకి నేషనల్ అవార్డ్ కూడా సొంతం చేసుకుంది.