గోవాలో త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విడుదల చేశారు. ఇందులో భాగంగా మహిళలకు హామీలు గుప్పించారు. గోవాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఉపాధి కల్పనకు రూ.500 కోట్లు కేటాయిస్తామన్నారు. అంతేకాదు గోవాలో మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచుతామని..మార్గోవా, పనాజీల్లో వర్కింగ్ విమెన్కు హాస్టళ్లు, పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.80 మించకుండా చూడటం వంటి పలు హామీలను మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది.
మరిన్ని వార్తల కోసం..