మధిరలో ప్రియాంక గాంధీ  సభా ఏర్పాట్ల పరిశీలన 

మధిరలో ప్రియాంక గాంధీ  సభా ఏర్పాట్ల పరిశీలన 

మధిర, వెలుగు :  మధిరలో శనివారం నిర్వహించనున్న  కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్రనేత ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లను శుక్రవారం సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్​ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. బహిరంగ సభ స్టేజి, హెలిప్యాడ్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. భద్రత విషయంలో రాజీ పడొద్దని వైరా ఏసీపీ రవికి సూచించారు.  

ఆరు గ్యారంటీలతో కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. ప్రజల సంపద ప్రజలకు పంచాలన్నదే కాంగ్రెస్ ధ్యేయమని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ల వల్ల ఉత్పత్తి అవుతున్న కరెంటుతో నేడు కొరతలేదన్నారు. కరెంటు అనేది కాంగ్రెస్ పేటెంట్ రైట్అని అన్నారు. సభకు ఇందిరమ్మ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు.