నవంబర్ 24, 25న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ

నవంబర్ 24, 25న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం స్పీడప్ చేసింది  కాంగ్రెస్ హైకమాండ్. ఇందులో భాగంగా పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ(నవంబర్ 24,25), రేపు తెలంగాణలో విస్తృతంగా పర్యటించనున్నారు ప్రియాంక గాంధీ. రేపటి నుంచి నాలుగు రోజులు ప్రచారం చేయనున్నారు రాహుల్. కర్నాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఇవాళ, రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు. 

ఇవాళ(నవంబర్ 24) మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తి సభలో పాల్గొననున్నారు ప్రియాంక. మధ్యాహ్నం ఒకటిన్నరకు హుస్నాబాద్ లో  ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 3 గంటలకు మిత్రపక్షమైన సీపీఐ పోటీ చేస్తున్న కొత్తగూడెంలో పర్యటించనున్నారు. 

ఇవాళ రాత్రి ఖమ్మంలోనే బస చేయనున్నారు ప్రియాంక.  రేపు ఉదయం 11 గంటలకు ఖమ్మం, పాలేరు లో విస్తృతంగా పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు సత్తుపల్లిలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత మధిర ప్రచారంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. మళ్లీ 27, 28 రెండు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నారు ప్రియాంక. 

డీకే శివకుమార్ మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్ ఘన్ పూర్ సభలోపాల్గొననున్నారు. ఆతర్వాత వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. రాత్రి అంబర్ పేట నియోజకవర్గంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు.